హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/రవీంద్ర భారతి: సీఎం కేసీఆర్ అధ్వర్యంలో అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈశ్వరీబాయి విద్య కోసం ఎంతో కృషి చేశారని, ఆమె స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈశ్వరీబాయి 104వ జయంతిని ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.
మహమూద్ అలీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మహనీయుల జయంతులు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. అనంతరం లతా రాజా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేకే రాజాకు ఈశ్వరీబాయి స్మారక పురసారాన్ని అందజేశారు. ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ గీతారెడ్డి, జీబీ రాజు, నర్రా రవికుమార్, రవీందర్బౌద్ పాల్గొన్నారు.