బడంగ్పేట (హైదరాబాద్) : ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తుక్కుగూడ మున్సిపాలిటీ ప్యాబ్సిటీలో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతిలో ఆమె మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(IT Minister KTR) ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని అన్నారు. స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగానికి (Industrial Sector) ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తున్న తోడ్పాటు, సులభతరంగా అనుమతుల మంజూరు తదితర అంశాలను ఆమె వివరించారు. ప్రభుత్వ సరళీకృత విధానాల వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పవర్ హాలిడేలతో అనేక పరిశ్రమలు మూతబడ్డాయని పేర్కొన్నారు.
స్వరాష్ట్ర పాలనలో పరిశ్రమల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగకుండా అన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట గడువులోపు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. రంగారెడ్డి మరో ఐటీ హబ్(IT Hub)గా మారబోతుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే 50 కంపెనీలకు పైగా వచ్చాన్నారు. ఈ ప్రాంత్ర యువతీ యువకులకు ఉదోగ్యాలు లభించే అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. మరో హైటెక్సిటీని తలపించే విధంగా మహేశ్వరం మారుతుందన్నారు.
రోడ్లు, రవాణా వసతిని మెరుగుపరుస్తూ, నీటి సౌకర్యం, 24 గంటల నాణ్యమైన విద్యుత్ శాంతి భద్రతల నెలకొని ఉండేలా పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపర్చామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గూగుల్, ఆమెజాన్, మైక్రోసాప్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ముఖ్య కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయని అన్నారు. 2014లో ఐటీ ఎగుమతులు రూ. 57 వేల కోట్లకు పరిమితమై ఉండగా, ప్రభుత్వ కృషితో ప్రస్తుతం రూ. 2.44 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. సేద్యపు రంగానికి సమాంతరంగా ఐటీ పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ చైరపర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.