CP Radhakrishnan | రాంచీ : జార్ఖండ్ రాజధాని రాంచీలో తెలంగాణ ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ క్యూలైన్లో వచ్చి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ తాను ఓటు వేసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు, దేశానికి ప్రజాస్వామ్య కర్తవ్యం కూడా అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
జార్ఖండ్లోని 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆరో విడతలో ఉదయం 9 గం. వరకు 10.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Today I exercised my democratic right and duty by voting in Ranchi. I urge all our voters , young voters to come out and participate in the festival of democracy in maximum numbers. Voting is not just a right but also a democratic duty to the Nation. #Elections pic.twitter.com/VQSZUeihXB
— CP Radhakrishnan (@CPRGuv) May 25, 2024