హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుతోపాటు మరో 21 మంది న్యాయవాదులకు ‘సీనియర్ న్యాయవాది’ హోదా కల్పిస్తూ హైకోర్టు ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ నేతృత్వంలో ఫుల్ కోర్టు (న్యాయమూర్తులు) సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. సీనియర్ హోదా సెప్టెంబరు 16 నుంచి అమల్లో ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ ప్రకటన విడుదల చేశారు.