హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్లో నిలిచిపోయిన ఎన్రోల్మెంట్ ప్రక్రియను తిరిగి కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయినప్పటికీ న్యాయపరమైన వివాదాల కారణంగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పడకపోవడంతో తాతాలిక కమిటీ ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేపట్టింది. దీన్ని సవాలు చేస్తూ బీ జగదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్పై సింగిల్ జడ్జి విచారణ జరిపి, ఎన్రోల్మెంట్ ప్రక్రియను నిలిపివేశారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ న్యాయవిద్య పూర్తిచేసిన కాలువ భువన శ్రీజారెడ్డి దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది బాగ్లేకర్ ఆకాశ్ కుమార్ వాదిస్తూ.. తన క్లయింట్ జూలై 27న ఎన్రోల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆగస్టు 13న ఎన్రోల్మెంట్ జరగాల్సి ఉండగా ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. దీంతో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన విద్యార్థులకు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యే హకు ఉంటుందని ధర్మాసనం పేరొన్నది. ఎన్రోల్మెంట్ ప్రక్రియకు బార్ కౌన్సిల్ ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. దీంతో సోమవారం నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు.