హైదరాబాద్ : తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్-2021) జులై 11న జరగనుంది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు టీజీయూజీసెట్ కన్వీనర్ డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహణ. అభ్యర్థులు జులై 5వ తేదీ నుండి సంబంధిత వెబ్సైట్స్ www.tswreis.in or www.tgtwgurukulam.telangana.gov.in నుండి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.