హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీసెట్- 2026) ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఈ మేరకు సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతిలో, 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.