హైదరాబాద్ : కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయులతో సహా 225 మంది మరణించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్కు గురైన ఉపాధ్యాయుల కుటుంబాలకు మద్దతుగా టీకా డ్రైవ్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు కె. జంగయ్య, ప్రధాన కార్యదర్శి సీహెచ్. రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.