హైదరాబాద్ : భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు లంగర్ హౌస్లోని బాపూ ఘాట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు మహముద్ అలీ, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జీవన్ రెడ్డి, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.