హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్స్.. కనీస నిల్వ నీటిమట్టం (ఎండీడీఎల్)పై ఆధారపడి లేవని కృష్ణానదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) పేర్కొనడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ రెండూ తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులని గుర్తుచేసింది. వాటికి సంబంధించిన రూల్కర్వ్స్ను ఏ ప్రాతిపదికగా నిర్ధారించారో కచ్చితంగా ఇరు రాష్ర్టాలకు చెప్పాల్సి ఉం టుందని పేర్కొన్నది. ఇప్పటికైనా అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి తెప్పించి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేర కు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు.
చెన్నైకి తాగునీటిని సరఫరా చేసేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్లో 854 ఎండీడీఎల్ మెయింటెన్ చేయా ల్సి ఉంటుందని గతంలో కేఆర్ఎంబీ సమావేశాల్లో ఏపీ వాదించింది. దీనిని తెలంగాణ వ్యతిరేకించింది. శ్రీశై లం ప్రాజెక్టు రూల్కర్వ్స్ను ఏ ప్రతిపాదికన నిర్ధారించారో, ఎండీడీఎల్ 854 అడుగులుగా ఏవిధంగా ప్రతిపాదిస్తున్నారో తెలియజేయాలని, ట్రిబ్యునల్ అవార్డు లో అది ఎక్కడున్నదో చూపాలని గతంలోనే డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రశ్నలకు నేరుగా జవాబు ఇవ్వకుం డా.. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్స్.. ఎండీడీఎల్పై ఆధారపడి లేవంటూ కేఆర్ఎంబీ దాటవేత ధోరణిలో సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మరోసారి ఘాటుగా లేఖ రాసింది. రూల్కర్వ్స్ ఎండీడీఎల్పై అధారపడవని పేర్కొనడం సరికాదని తెలిపింది.