హైదరాబాద్ : పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని సెట్ కార్యదర్శి శ్రీనాథ్ పేర్కొన్నారు. రూ. 100 ఆలస్య రుసుముతో ఈనెల 20 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఇంకా పరీక్ష నిర్వహణ తేదీని ఖరారు చేయలేదని, త్వరలో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాలిసెట్ కార్యదర్శి శ్రీనాథ్ సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.