BRS Leader Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పట్ల మాజీ మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరం అన్నారు. సంపత్ రెడ్డి కుటుంబసభ్యులకు హరీశ్రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంపత్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని హరీశ్రావు భగవంతుడిని ప్రార్థించారు.
జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయనకు సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆయన్ను హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ పాగాల సంపత్ రెడ్డి మరణించారు.