Telangana Formation Day | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని మధ్యప్రదేశ్, అస్సాం ప్రభుత్వా లు నిర్ణయించాయి. జూన్ 2న రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభు త్వం తొలిసారి అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తన ను ఆహ్వానించినందుకు గర్వంగా ఉం దని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి పీ నరహరి ట్వీట్ చేశా రు. ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నట్టు తెలిపారు. అస్సాం ప్రభుత్వం కూడా తె లంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నది. రాజ్భవన్లో ని ర్వహించే వేడుకలకు హాజరుకావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిన ట్టు అస్సాం తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఇదే తరహాలో ఇతర రాష్ర్టాల్లో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్స వాలను నిర్వహించనున్నారు.