హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధనలో ఉద్యోగుల పెన్డౌన్ చరిత్రాత్మక పోరాటమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. పెన్డౌన్ ప్రారంభమైన నవంబర్ 30ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ ఘట్టాలను నెమరువేసుకున్నారు. సిద్దిపేట ఉద్యోగ గర్జనలో కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న పోరాటమే పెన్డౌన్ అని ఓ ప్రకటనలో గుర్తుచేశారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, కార్యాలయాల్లో పోలీస్ క్యాంపులు పెట్టినా బెదరకుండా రాష్ట్ర సాధన కోసం పెన్డౌన్తో ఉద్యోగులు చేసిన పోరు పెద్ద జ్వాలగా మారిందన్నారు. ఈ పోరా టం స్ఫూర్తిగా సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి అద్భుత పోరాటాల్లో ముందుండి నడిచిన ఉద్యోగులు, ఉద్యమకారులకు అభినందనలు తెలిపారు.