హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్కులలో(Parks) పచ్చదనాన్ని పెంచి ఎంతో అభివృద్ధి చేసిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్టీ, ఇండస్ట్రియల్ పార్క్, పద్మారావు నగర్ పార్క్లలో వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ పై మరింత శ్రద్ధ పెరిగిందన్నారు.
ప్రభుత్వం పార్కులలో పచ్చదనాన్ని మరింత పెంచడంతో పాటు వాకర్స్కు అవసరమైన సౌకర్యాలు కల్పిచిందని పేర్కొ న్నారు. ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి అందరికి అందుబాలోకి తెచ్చామన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలతో ఓట్ల కోసం వచ్చే వారపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్నేండ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ విధానాలతో దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి దీవించాలన్నారు.