హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ సంఘాలకు ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆన్ డ్యూటీ (ఓడీ) అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్యూపీపీ టీఎస్), ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం (యూటీఏ టీఎస్) సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.