హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31: రాష్ట్ర చీ ఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటంను వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు వరించింది. మాస్కోలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన మొదటి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం సదస్సులో ఆమెకు అవార్డు అందించారు. డాక్టర్ శాంత టీ హబ్ ఉపాధ్యక్షురాలిగా కెరీర్ను ప్రారంభించి, ఎకో సిస్టంలో ఏడేండ్లుగా సేవలందించడంతో పాటు రాష్ట్ర చేనేత జౌళిశాఖ ఓఎస్డీగా పనిచేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ శాంత మాట్లాడుతూ శ్రీవారి దార్శనికతను స్ఫూర్తిగా తీసుకున్నానని.. ఈ అవార్డును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అంకితమిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ డాక్టర్ శాంతను అభినందించారు.