హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన, పోయిన మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలంగాణ సీఐడీ చీఫ్ మహేశ్ భాగవత్ తెలిపారు. దేశం మొత్తంలో 35 శాతం రికవరీ రేటుతో మనం టాప్లో ఉన్నట్టు చెప్పారు. దక్షిణ రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించినట్టు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ వివంతాలో టెలికం భద్రతపై మంగళవారం నిర్వహించిన సౌత్జోన్ స్థాయి సమావేశంలో మహేశ్ భాగవత్ మాట్లాడారు. కేవలం ఏడు నెలల్లో 12,500లకుపైగా ఫోన్లను వెతికి వినియోగదారులకు అందించామని చెప్పారు.