హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16వ తేదీన (సోమవారం) ఉదయం 11.45 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత అసెంబ్లీ హాల్లో శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీచేశారు. బడ్జెట్ సమావేశాలను 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శనివారం జారీ చేశారు.