హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ): నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి నిరుడు జూలై 15న కేంద్రం జారీచేసిన గెజిట్ను సవరించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు గోదావరినదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ సోమవారం ఒక లేఖ రాశారు.
వివిధ ప్రాజెక్టుల అనుమతుల కోసం తెలంగాణ సమర్పించిన డీపీఆర్లను ఇంకా ఆమోదించలేదని జీఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. డీపీఆర్లను ఆమోదించడంతో పాటు తెలంగాణ లేవనెత్తిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.