హైదరాబాద్ : నిజామాబాద్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని దుబ్బ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.