Hyd Airport | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పలు సాంకేతిక కారణాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-కౌలాలంపూర్, హైదరాబాద్-వియత్నాం విమానాలు సాంకేతిక లోపంతో రద్దు చేశారు. హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఎయిర్స్లైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్బస్ 984 ఫ్లయిట్ ఆలస్యమైంది. శుక్రవారం రాత్రి 11గంటల నుంచి వియత్నాం వెళ్లాల్సిన ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఎయిర్లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు 500 దేశీయ, అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దాంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఎదురైంది. విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఆటోమేటెడ్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో సాంకేతిక సమస్య కారణంగా మంబయిలో విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ వ్యవస్థ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సహాయపడుతుంది.