కరోనా నేపథ్యంలో ఆదేశాలు జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను పోస్టు ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇదివరకు టీచర్లు తమ మెడికల్ బిల్లులను ప్రత్యక్షంగా హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో సమర్పించేవారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పోస్టు ద్వారానే స్వీకరిస్తామని,నేరుగా రావొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఇన్వార్డు ఎదుట నోటీసులు అంటించారు.