మాగనూర్, జూన్ 25 : యువతి అత్మహత్య కేసులో ఉపాధ్యాయుడు సస్పెండ్ అయిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఇన్చార్జి ఎంఈవో గణేశ్సింగ్ తెలిపిన వి వరాల ప్రకారం .. మాగనూర్ మం డలం గురురావు లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న వినోద్.. నారాయణపేటలో చదువుకుంటున్న ఓ యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీంతో యువతి ఆత్మహత్యకు పాల్పడగా.. ఉపాధ్యాయుడిపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. నిందితుడు 48 గంటలపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో వినోద్ను ఎంఈవో సస్పెండ్ చేశారు.