హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఒక్క చాయ్ వెయ్యి రూపాయలు! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముదురు బంగారు వర్ణం.. గమ్మత్తైన సు వాసన.. మైమరపించే రుచి.. అద్భుతమైన అనుభూతి.. ఇలాంటి విశేషణాలేవీ ఈ స్పెషల్ చా య్ను వర్ణించడానికి సరిపోవు. అమోఘమైన చాయ్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. హైదరాబాద్లోని నిలోఫర్ కేఫ్లో ఈ అద్భుతమైన చా య్ను ఎంచక్కా సిప్ చేయొచ్చు. ఈ చాయ్ త యారీకి వినియోగించే పత్తా అత్యంత అరుదైనది. అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతంమైజాన్ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. మైజా న్ గోల్డెన్ టిప్స్గా పేరొందిన తేయాకు మొగ్గలు ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా లభిస్తాయి. వాటిని సూర్యోదయానికి ముందే సేకరించాల్సి ఉంటుంది. తెలతెలవారకముందే సేకరించిన ఆ మొగ్గలను ఆరబెట్టి, పొడి గా చేస్తారు. ఇలాంటి పొడి ఎప్పుడో ఒకసారి కిలో, కిలోన్నర పరిమాణంలోనే ఉత్పత్తి అవుతుంది. దీనికి డిమాండ్ ఎక్కువ కాబట్టి వేలంద్వారా విక్రయిస్తారు. కోల్కతాలో నిర్వహించిన వేలంలో నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు దీనిని రూ.75 వేలకు చేజిక్కించుకొన్నారు. దాని తో తయారుచేసిందే ఈ చాయ్. దీని తయారీలో మరో ప్రత్యేకత పాలు అసలు వాడకపోవడం. డి కాషన్ రూపంలోనే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు టీ తయారీ కోసం 4 గ్రాముల మైజాన్ గోల్డెన్ టిప్స్ను వినియోగిస్తామని చెప్తున్నారు నిలోఫర్ కేఫ్ యజమాని అనుముల శశాంక్.