బంజారాహిల్స్, డిసెంబర్ 25: సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ కార్యాలయం వద్ద సోమవారం టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాను నిరసిస్తూ పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66లోని అతని కార్యాలయం వద్దకు వెళ్లి పలువురు ఆందోళన చేపట్టారు.
ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వ్యూహం చిత్రం ఫ్లెక్సీలను చించివేసి, మరికొన్నింటిని తగులబెట్టారు. దీంతో కార్యాలయ వర్గాలు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికి ఆందోళనకారులు పరారయ్యారు.