హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకొన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి వ స్తుందని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు.