నాగర్కర్నూల్, డిసెంబర్ 19: గుప్తనిధుల ఆశచూపి, మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో 11 మందిని హత్య చేసి సంచలనం రేపిన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన తాంత్రికుడు సత్యంయాదవ్ను మంగళవారం పోలీస్ కట్టడీకి తీసుకున్నట్టు సమాచారం. సీరియల్ కిల్లర్గా ఉంటూ హత్యలు చేస్తున్న సత్యంయాదవ్ను వారం కిందట అదుపులోకి తీసుకొని జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే.. సత్యంయాదవ్ను ఇప్పటికే విచారించగా.. పలు కొత్త విషయాలు వెలుగచూశాయి. దీంతో మరో రెండు రోజులపాటు విచారించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.