హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మైనింగ్ సేఫ్టీ విభాగంలో టీఎస్ జెన్ కోకు చెందిన తాడిచెర్ల-1 ఓపెన్కాస్ట్కు మొద టి బహుమతి లభించింది. 53వ వార్షిక భద్రతా పక్షోత్సవాల-2021లో భాగంగా ఉత్తమ సేఫ్టీ ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డు దక్కింది. హైదరాబాద్లో రీజియన్ మైనింగ్ సేఫ్టీ డీజీ నుంచి కోల్ అండ్ కమర్షియల్ సీఈ బాలరాజు, మైన్స్ జీఎం మోహన్రావు అవార్డు అందుకున్నారు. అవార్డుకు కృషి చేసిన వారిని జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, డైరెక్టర్ టీఆర్కే రావు అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరారు.