భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సాహస నారి.. గులాబ్ కౌర్. గదర్ వీరులతో చేయి కలిపి సాయుధ పోరుకు సిద్ధపడి, కుటుం బ జీవితాన్ని త్యాగం చేసింది. జైల్లో బ్రిటిష్ సైనికుల చిత్రహింసలకు బలైపోయింది. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా బక్షివాలా గ్రామం లో గులాబ్కౌర్ జన్మించింది. ఆమెకు మాన్సింగ్తో వివాహం చేశారు. ఈ జంట బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లేందుకు ఫిలిప్పీన్లోని మనీలా చేరుకుంది. అక్కడ గదర్ పార్టీ నేతలతో పరిచయం ఏర్పడింది.
భారతదేశ విముక్తి కోసం పోరాడాలని నిశ్చయించుకుంది. భర్త అమెరికా వెళ్లిపోయా డు. గులాబ్కౌర్ గదర్ వీరులతో కలిసి కొరియా, సింగపూర్ మీదుగా పడవల్లో ప్రయాణిస్తూ తిరిగి భారత్ చేరుకుంది. జర్నలిస్టునని చెప్పుకొంటూ పంజాబ్ ఫ్రావిన్స్లో గదర్ పార్టీ కోసం రహస్యంగా విప్లవ సాహిత్యాన్ని ప్రచురించింది. గదర్ పార్టీ సభ్యులకు ఆయుధాలను సరఫరా చేసేది. సాయుధ పోరాటానికి ప్రజలను సమీకరించేందుకు కపుర్తలా, హోషియార్పూర్, జలంధర్ ప్రాంతాలలో చురుగ్గా పనిచేసింది. ఆమెపై బ్రిటిష్ సర్కార్ రాజద్రోహం కేసు పెట్టింది. రహస్యాలు చెప్పాలని జైలులో చిత్రహింసలకు గురి చేయడంతో 1931లో గులాబ్కౌర్ కన్నుమూసింది.