తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఖజానాలోకి మరో అరుదైన ఆభరణం చేరబోతున్నది. సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వర్ణకఠారిని హైదరాబాద్కు చెందిన మోటూరి శ్రీనివాసప్రసాద్ అనే భక్తుడు స్వామివారికి విరాళంగా టీటీడీ అధికారులకు అందించనున్నారు. 6.5 కిలో బంగారంతో ఈ ఖడ్గాన్ని కోయంబత్తూరులో తయారుచేయించినట్టు దాత తెలిపారు. ఇందుకు ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు పేర్కొన్నారు.
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ