సుల్తాన్బజార్, జూన్ 8: బ్లాక్ ఫంగస్తో ప్రైవేట్ దవాఖానల్లో చేరినా సరైన వైద్యం అందకరపోవడంతో రోగులంతా కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానను ఆశ్రయిస్తున్నారు. అక్కడి వైద్యులు వారిని అక్కున చేర్చుకొని చికిత్సచేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న బ్లాక్ ఫంగస్ మందులను వారికి అందించి కోలుకొనేలా చూస్తున్నారు. మే 21 నుంచి ఈఎన్టీ దవాఖానలో 400 మందికి ఆపరేషన్లుచేశారు. మంగళవారం వచ్చిన 36 మంది అవుట్పేషెంట్లలో 27 మందిని అడ్మిట్ చేసుకొన్నారు.
పలు ప్రైవేటు దవాఖానల వారు యాంటి ఫంగస్కు మందులు లేకపోయినా సర్జరీలు చేసి రోగులను ఇబ్బందులు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో యాంటి ఫంగస్ ఇంజెక్షన్ రూ.50 వేలకుపైగా ఉన్నది. తెలిసో తెలియక ప్రైవేట్కు వెళ్లిన వారు ఆర్థిక భారాన్ని మోయలేక కోఠిలోని ఈఎన్టీకి వస్తున్నారు. సుమారు 23 మంది పోస్ట్ సర్జరీ రోగులు దవాఖానకు రాగా వారికి తగిన వైద్య చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే 400 శస్త్రచికిత్సలు పూర్తిచేశాం. మరో 200 వరకు ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉన్నది. ప్రస్తుతం బ్లాక్ఫంగస్ బాధితుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు పోస్టు సర్జరీ రోగులే అవుట్ పేషెంట్లుగా వస్తున్నారు.
-డాక్టర్ తాటి శంకర్, ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్