జాతీయోద్యమ కాలంలో జెండాను రూపొందించే ప్రయత్నాలు జరిగాయి. మొదటిసారిగా కలకత్తాలో 1906 ఆగస్టు 7న పార్శీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు.
రెండో జెండా..
దీన్ని 1907లో మేడవ్ు కామా ముంబైలో, విప్లవకారులు పారిస్లో ఎగురవేశారు. ఇది మునుపటి జెండాను పోలి ఉంది. ఏడు నక్షత్రాలు, సూర్య చంద్రుల చిహ్నాలున్నాయి.
మూడో జెండా
హోం రూల్ ఉద్యమ కాలంలో (1917లో) డాక్టర్ అనిబిసెంట్, తిలక్ ఈ జెండాను ఎగురవేశారు. 5 ఎరుపు , 4 ఆకుపచ్చ గీతలతో పాటు ఏడు నక్షత్రాలను చేర్చారు.
నాలుగో జెండా
బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీకి తాను రూపొందించిన జాతీయ జెండాను పింగళి వెంకయ్య బహూకరించారు. ఆకుపచ్చ, కాషాయ వర్ణాలతోపాటు చరఖా చిహ్నమున్న ఈ జెండాలో తెలుపు రంగును చేర్చాలని గాంధీ సూచించారు. ఆయన సూచన ప్రకారం తెలుపు రంగు చేర్చారు పింగళి వెంకయ్య.
ఐదో జెండా
దీనికి నేటి జాతీయ జెండాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇందులో మధ్యలో ఉన్న తెలుపు రంగులో చరఖా చేరింది. 1931లో దీనికి భారత జాతీయ కాంగ్రెస్ పతాకంగా ఆమోదం లభించింది.
నేటి తిరంగా..
భారత రాజ్యాంగ పరిషత్ 22 జూలై 1947న దీనిని స్వేచ్ఛా భారత జాతీయ జెండాగా ఆమోదించింది. ఈ జెండాని రూపొందించింది హైదరాబాద్ ఆడబిడ్డ సురయ్యా త్యాబ్జీ. తెలుపు రంగులో చరఖాకు బదులుగా అశోక ధర్మ చక్రం ఉంచి సురయ్యా త్యాబ్జీ ఈ జెండాను రూపొందించారు. ఈ జెండా 1947 ఆగస్టు 15న జవహర్ లాల్ నెహ్రూ కారు మీద రెపరెపలాడింది.