హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్కు చెందిన శ్రుతి దేవులపల్లికి అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్లో పీహెచ్డీ డిగ్రీని ప్రదానం చేసింది. ‘హైదరాబాద్ లో కొవిడ్కు ముందు, కొవిడ్ లాక్డౌన్ సమయంలో, కొవిడ్ అనంతరం గాలి నాణ్యత’ అంశంపై చేసిన పరిశోధనకు శ్రుతికి డాక్టరేట్ లభించింది. శ్రుతి దేవులపల్లి ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవార్టిస్లో సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నారు. నగర వాతావరణంపై ప్రభావం చూపిస్తున్న వివిధ వాయు కాలుష్య కారకాలపై ఆమె లోతైన పరిశోధన చేసి, థీసీస్ను వర్సిటీకి సమర్పించారు. సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ పీ మధుసూదనరెడ్డి మార్గదర్శకత్వంలో శ్రుతి దేవులపల్లి ఈ పరిశోధన చేశారు.