హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రైవేట్ మీటర్ రీడర్ సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి గురువా రం ఉత్తర్వులు జారీచేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మలక్పేట్ ఏడీఈ మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, విద్యానగర్ లైన్మెన్ సపావత్ శ్రీనివాస్, జగిత్యాల సబ్ ఇంజినీర్ షేక్ సాజన్, మిర్యాలగూడ ఏడీఈ మంగళగిరి సైదులు తదితరులను సస్పెండ్ చేశారు.