హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్లో ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్-డైరెక్టర్ సుష్మ చెప్పారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10లోపు ఐదు ర్యాంకులు, టాప్ 100 లోపు 32 ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ. ఓపెన్ క్యాటగిరీలో వావిలాల చిద్విలాస్రెడ్డి ఆలిండియా 1వ ర్యాంకు, రమేశ్ సూర్యతేజ 2వ ర్యాంకు, కర్ల రిషి 3వ ర్యాంకు, రాఘవ్ గోయల్ 4వ ర్యాంకు, బీ అభినవ్ చౌదరి 7వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు.
ఇలా ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10లోపు 5 ర్యాంకులు వచ్చాయని, తెలుగు రాష్ర్టాల్లో మరే ఇతర విద్యాసంస్థకూ ఇలాంటి ర్యాంకులు రాలేదని చెప్పారు. టాప్ 100లోపు 32 ర్యాంకులు, టాప్ 1000లోపు 181 ర్యాంకులు, ఆల్ క్యాటగిరిల్లో టాప్ 10లోపు 21, టాప్ 100లోపు 142, టాప్ 1000లోపు 699 ఒక్క శ్రీచైతన్య విద్యార్థులే సాధించినట్టు ఆమె వివరించారు. ఈసారి ఐఐటీల్లో మొదటి వరుసతోపాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం వాటా శ్రీచైతన్యదేనని నిరూపించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు అభినందించారు.