యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సతీసమేతంగా దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం గుట్టకు చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడికి పూజలు చేశారు. అనంతరం స్వయంభూ నూతనాలయం, ముఖ మండపం, తిరుమాడ వీధులను పరిశీలించారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ డీఈవో దోర్భల భాస్కర్శర్మ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. – యాదాద్రి