హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ దాఖలుచేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం విచారణ జరపనుంది.
గత విచారణ సందర్భంగా.. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. శాసనసభలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కూడా ఇదేకేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ నాయకులు కోర్టు ధికరణ పిటిషన్ కూడా వేశారు. వీటిపై కూడా శుక్రవారం విచారణ జరుగనుంది.