హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్లో మంగళవారం కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రించాలని, పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని, స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ ఫొటో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఢిల్లీలో జరిగే జ్ఞాన యుద్ధ మహాసభ ధర్నాకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే విజయరావు, కందుకూరి ప్రభాకర్, భైరిపాక బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు.