హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణను చివరిసారిగా చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అభిమాన హీరోకు కన్నీటి వీడ్కోలు పలికారు. సూపర్ స్టార్ అభిమానులతో పద్మాలయ స్టూడియో కిక్కిరిసి పోయింది. ఇవాళ కూడా పలువురు సిసీ ప్రముఖులు కృష్ణ పార్థీవదేహానికి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియో నుంచి సూపర్ స్టార్ అంతిమయాత్ర ప్రారంభం అయింది. అధికార లాంచనాలతో ప్రభుత్వం కృష్ణ అంతక్రియలను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్రామ్గూడలో ఆయన నివాసం విజయకృష్ణ నిలయం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకురాగలిగినా ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు.
Krishna Gari Sena 🙏🏻🙏🏻#RIPSuperStarKrishnaGaru pic.twitter.com/iSVPC2j2Q6
— Pandu Gadu ™ (@PG_4005) November 16, 2022