హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు కిటకిటలాడాయి. హైదరాబాద్ మియాపూర్లోని కల్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రేమను, శాంతిని ప్రబోధించే క్రిస్మస్ పర్వదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. చర్చ్ ప్రాంగణాలు ప్రత్యేక ప్రార్థనలతో పరిమళించాయి. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ ఇలా విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలిపింది.