హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్డీఏ) ఇంచార్జి ఎండీగా తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారాయుడుకి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు టీఎస్ఎల్డీఏ సీఈవో సబావత్ రాంచందర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గొర్రెల పంపిణీ స్కాం కేసులో మే 31న ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది.