జనగామ టౌన్, మే 8 : జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం అధికార యంత్రాం గం నిర్వహించిన జనగణన- 2027 అవగాహన ర్యాలీ వివాదాస్పదమైంది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీ ముగిసిన తర్వాత విద్యార్థులను మున్సిపాలిటీకి సంబంధించిన స్వచ్ఛ తెలంగాణ తడి చెత్త సేకరణ వాహనంలో తరలించారు. దీనిపై ప్రజాసంఘాల నాయకులు, తల్లిదండ్రులు అధికారులు తీరుపై మండిపడ్డారు. భావి భారత పౌరులకు జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్నగర్ మినీ స్టేడియంలో సమ్మర్ క్యాంప్లో ఉంటున్న విద్యార్థులను ర్యాలీ అనంతరం వారి పీఈటీ అభ్యర్థన మేరకు హరితహారం ఆటోలో తరలించినట్టు పేర్కొన్నారు.