హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ఓయూ జేఏసీ నాయకులు, బంజారా జనసంఘం నేతలు భిక్షపతినాయక్, శ్రీనివాస్యాదవ్, తోట కమలాకర్, బీసీ విద్యార్థి సంఘం నేతలు సాయికుమార్, సూర్యవంశీ, రాందాస్ నాయక్ బృందం మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
పలు ఇంజినీరింగ్ కాలేజీలపై విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇదే విషయాన్ని లోకాయుక్త దృష్టికి కూడా తెసుకెళ్తామని వెల్లడించారు.