హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, హకుల సాధన కోసం సాగే పోరాటంలో అవసరమైన భావజాల వ్యా ప్తి కోసమే బీసీ రచయితల సమాఖ్య ఆవిర్భవించిందని సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గాజోజు నాగభూషణం పేర్కొన్నారు. స మాఖ్య విస్తరణలో భాగంగా రాష్ట్ర, జిల్లాల అడ్హక్ కమిటీలను మంగళవారం ప్రకటించారు. బీసీల హకుల సాధన కోసం కొనసాగుతున్న పోరాటానికి ఉపయుక్తమయ్యే సాహిత్యాన్ని, కళలను సుసంప న్నం చేయడమే బీసీ రచయితల సమాఖ్య లక్ష్యమని వెల్లడించారు. బీసీలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే అంతి మ లక్ష్యమని స్పష్టంచేశారు. బీసీ అస్తిత్వ స్పృహతో సాహిత్య సృజనను కొనసాగిస్తు న్న రచయితలందరూ సమాఖ్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు. త్వరలో మహాసభ నిర్వహించనున్నామని అందులో భాగంగా అడ్హక్ కమిటీలను ప్రస్తుతం ప్రకటించామని, త్వరలో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బీసీ రచయితల సమాఖ్య కన్వీనర్లు
బీసీ రచయితల సమాఖ్య జిల్లాల అడ్హక్ కమిటీని ప్రకటించారు. ఉదారి నారాయణ-ఆదిలాబాద్, పిన్నంశెట్టి కిషన్-హైదరాబాద్,ఉప్పల పద్మ-రంగారెడ్డి, రాజేశ్ ఖన్నా-హనుమకొండ, బోగ అశోక్-జగిత్యాల, గుడికందుల కృష్ణ-జనగామ, శ్రీధర్గౌడ్-భూపాలపల్లి, అవనిశ్రీ-గద్వాల, శ్రీమంతుల సదాశ్రీ-కరీంనగర్, చింతకాయల ఆంజనేయులు-ఖమ్మం, రాగ రాజేశ్వరి-కొత్తగూడెం, నల్లగొండ సురేశ్- ఆసిఫాబాద్, తండా హరీశ్-మహబూబాబాద్, భీంపల్లి శ్రీకాంత్-మహబూబ్నగర్, గోపగాని రవీందర్-మంచిర్యాల, టౌడబోయిన తిరుపతి-మెదక్, కృష్ణగౌడ్-మేడ్చల్, ఏ చంద్రమోహన్-సంగారెడ్డి, తాడిచెర్ల రవి-ములుగు, కమలేకర్ నాగేశ్వరరావు-నాగర్కర్నూల్, చుండూరు జగన్మోహన్-నిజామాబాద్, అల్లి మోహన్రాజ్-కామారెడ్డి, తండు కృష్ణకౌండిన్య-నల్లగొండ, కృష్ణంరాజు-నిర్మల్, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు-పెద్దపల్లి, ఎలుగొండ రవి-సిరిసిల్ల, పెందోట వెంకటేశ్వర్లు-సిద్దిపేట, వీ వెంకటేశ్వర్లు-సూర్యాపేట, జీ యోచన-వరంగల్, కే వీరయ్య-నారాయణపేట, జీ శ్రీనివాస్-వికారాబాద్, బాసరాజు యాదగిరిని యాదాద్రి భువనగిరి జిల్లాకు కన్వీనర్లుగా నియమించారు.