హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సమస్యలను పరిషరించి రెవెన్యూశాఖను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో జరిగిన ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించారని, రెవెన్యూలో మాత్రం ఇవ్వలేదని చెప్పారు. వెంటనే బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ధరణి సమస్యల పరిషారానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నామని, అయినా సరైన గుర్తింపు దకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం మరింత బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిషారానికి సమర్థంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, పూల్ సింగ్, రియాజుద్దీన్, కోశాధికారి వెంకటేశ్వర్రావు, రాష్ట్ర కో-ఆర్డినేటర్ నారాయణ్రెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్బీ శాస్త్రి, ఆరేటి రాజేశ్వర్, మంజుల, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, నిరంజన్రావు, పల్నాటి శ్రీనివాస్రెడ్డి, కే వెంకట్రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు దేశ్యా, జగన్మోహన్రెడ్డి, బన్సీలాల్, విష్ణుసాగర్, సంయుక్త కార్యదర్శులు శైలజ, నాయకులు సతీశ్, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 33 జిల్లాల అసోసియేన్ అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీసీఎల్ఏ యూనిట్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.