కేసీఆర్ సేవాదళం హుజూరాబాద్ ఇంచార్జి తొగరు శివకృష్ణ
హుజూరాబాద్ టౌన్, మే 17: ఇటీవల ఈటల రాజేందర్ ‘గొర్రెల మీదికి తోడేలు ఎగబడ్డట్టు’ అని మాట్లాడి ఇక్కడి ప్రజల, మంత్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, వెంటనే క్షమాపణ చెప్పాలని కేసీఆర్ సేవా దళం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి తొగరు శివకృష్ణ డిమాండ్చేశారు. సోమవారం హుజూరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. తాము విద్యార్థి దశలోనే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి సైనికుల్లా పనిచేస్తూ నిత్యం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నామని స్పష్టంచేశారు. తమను ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదని, కొందరు నాయకులను, ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూస్తున్నది ఈటల రాజేందరేనని ఆరోపించారు. ఇక నుంచి నియోజకవర్గంలో ఎవరైనా పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు, విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళం నియోజకవర్గ వైస్ ఇంచార్జి కన్నబోయిన నాగరాజు, నియోజకవర్గ నాయకులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, అంబాల రవికాంత్, జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు ముస్తాఫా, వంశీ, వినయ్యాదవ్, శివ, చందు పాల్గొన్నారు.