హైదStatue of Equality | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీరామనగంలో శ్రీరామానుజ స్వామివారి సహస్రాబద్ది సమరోహ కార్యక్రమం అంగరంవవైభవంగా మొదలైంది. బుధవారం శ్రీరామనగరంలో చినజీయర్ ఆశ్రమం నుంచి శ్రీ పెరుమాళ్ల లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ యాత్ర ప్రారంభమై యాగశాలకు చేరుకుంది. శోభాయాత్రలో అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామనుజ జీయర్ స్వామి, రామచంద్రరామానుజ జీయర్ స్వామి, అష్టాక్షర రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు.
రామానుజ శ్లోకాలు, భక్తి పాటలు, నినాదాలు, వాయిద్యాల నడుమ యాత్ర అత్యంత భక్తిపరవశంతో సుమారు 3 కిలోమీటర్ల మేర కొనసాగి యాగశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా కోలాటాలు, నృత్యాలతో శ్రీరామన్నారాయణ సంకీర్తనలు ఆలపించడంతో శ్రీరామనగర ప్రాంతం భక్తి పరిమలభరితంతో విలసిల్లినది.
ఈ సందర్భంగా యాగశాలలో శాంతిహోమం నిర్వహించి భక్తుల కోసం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రవచనాన్ని వినిపించారు. చినజీయర్తోపాటు పూజల్లో మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు, మైహోం ఎండీ జూపల్లి జగపతిరావు, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.