హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందర్రాజన్, హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ హిమాకోహ్లి, ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ప్రగతిభవన్లో జెండావిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లోని సైనిక అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ వీ భూపాల్రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. సచివాలయంలో సీఎస్ సోమేశ్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణభవన్లో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు జెండా ఎగురవేశారు. అన్ని జిల్లా, నియోజకవర్గకేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో మం త్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ శాఖల కా ర్యాలయాలు, పార్టీల ఆఫీసులు, ప్రైవేట్ సంస్థ ల్లో జెండా పండుగ నిర్వహించారు.