బంజారాహిల్స్, డిసెంబర్ 5: పౌల్ట్రీ రైతులను ఆదుకునేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను దెబ్బతీసేలా అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని మానుకోవాలని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఉపాధ్యక్షుడు జక్కా రాంరెడ్డి, కార్యదర్శి వుడుతల భాస్కర్రావు కోరారు. సోమవారం వారు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏండ్ల నుంచి పౌల్ట్రీ రైతులకు తక్కవ ధరకే మొక్కజొన్నలను అందజేస్తున్నదని గుర్తు చేశారు. 2018-19 సంవత్సరానికి మొక్కజొన్న కేటాయింపులో కుంభకోణం జరిగిందంటూ కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమకు 8.29 లక్షల టన్నుల మొక్కజొన్నలను కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు రాఘవరావు, రమేశ్బాబు, నారాయణరెడ్డి, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.